విభజనకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు
విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ పత్రికను అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇస్తున్నాం. ‘సాక్షి’ని ఆహ్వానించి ఉంటే బాబుకు ఈ కింది ప్రశ్నలు వేసి జవాబు అడిగేది.
1. తెలంగాణకు అనుకూలంగా 2008లో పార్టీ పొలిట్బ్యూరోలో తీర్మానం చేసి ప్రణబ్ముఖర్జీ కమిటీకి లేఖ రాసినప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎందుకు కోరలేదు?
2. గతేడాది డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మీ పార్టీ ప్రతినిధులుగా హాజరైన కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో రాష్ట్రాన్ని ఫలానా పద్ధతిలో విభజించాలని ఎందుకు కోరలేదు?
3. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన రాజధాని ఏర్పాటుకు రూ. నాలుగైదు లక్షల కోట్లు అవసరమని చెప్పి.. తర్వాత చాలా రోజులు మాట్లాడకుండా.. ఇప్పుడేమో ఇరు ప్రాంతాలతో చర్చించాలని కోరడమేంటి?
No comments:
Post a Comment